న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు వీరంగం సృష్టించారు. దుండగులు ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో ఉన్న జిమ్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. జిమ్ యజమాని సోదరుడికి గాయాలయ్యాయి. మృతి చెందిన చిన్నారి జిమ్ యజమాని ఫ్లాట్లోనే తన ఫ్యామిలీతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. దుండగులు కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.