కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తెరాస గూటికి చేరనున్నారా? కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సభ నిన్న హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఆ సభకు డుమ్మా కొట్టిన సబితా ఇంద్రారెడ్డి…ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో భేటీ అయ్యారు. తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి ఆమె కారెక్కే చాన్స్ ఉందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాలకు ఒకింత దూరంగా ఉంటూ వస్తున్నారు.