తెలంగాణ సీఎం కెసిఆర్ రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్నే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపీకొట్టి అన్నదాత సుఖీభవ పథకం పెట్టారని ఎద్దేవా చేశారు తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని కాపి కొట్టి అన్నదాత సుఖీవ అనే పేరు పెట్టుకున్నారన్నారు. చంద్రబాబునాయుడు ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కేసీఆర్ గురించి దుమ్మెత్తి పోస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.