ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేషన్ల చివరితేదీ వరకు ఓటర్ల నమోదు:సీఈసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 05:25 PM

ఢిల్లీ:  దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మ్రోగింది. 17వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు చీఫ్ ఎన్నికల అధికారి సునీల్ అరోరా షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ప్రణాళికను విడుదల చేశారు. దీంతో నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అభ్యర్థుల నామినేషన్ల చివరితేదీవరకు కూడా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగనుందని.. ఎన్నికలకు పదిరోజుల ముందు వరకు కూడా ముందస్తు అనుమతి లేకుండా ఓటును తొలగించడానికి లేదన్నారు. పోలింగ్ ఐదురోజుల ముందే పోలింగ్ స్లిప్పులను విడుదల చేస్తామన్నారు. ఒక్కసారి ఓటర్ల తుదిజాబితా విడుదల చేసిన తర్వాత ఎలాంటి మార్పులు ఉండవని.. ప్రతి ఓటరు విధిగా తుదిజాబితా విడుదలకు ముందే తమ ఓటును చెక్ చేసుకోవాలని చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com