న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మొత్తం తొంబై కోట్ల మంది ఓటర్లున్నారు. 2014 తర్వాత కొత్తగా 8 కోట్ల 40 లక్షల మంది ఓటర్లు చేరగా ఒకటిన్నర కోటి మంది కొత్తగా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.