ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, తాజాగా హరిప్రియా నాయక్ రాజీనామా చేశారు. ఈరోజు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో భేటీ కావడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. సబితారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 19 మంది సభ్యుల బలం ఉండగా ఐదుగురు పార్టీ వీడే అవకాశం ఉన్నందున సంఖ్యాబలం 14 కు తగ్గనున్నది.