హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న కరీంనగర్, 19వ తేదీన నిజామాబాద్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ పోటీ చేసే 16 లోక్సభ స్థానాలు.. ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్లో కూడా కేసీఆర్ ప్రచార సభలు నిర్వహించనున్నారు. బుధవారం టీఆర్ఎస్ 16 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను సీఎం ప్రకటించనున్నారు. సిట్టింగ్ల్లో ఒకటి లేదా రెండు సీట్లలో అభ్యర్థుల మార్పు ఉంటుందని సమాచారం.