హైదరాబాద్ : ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో సీఈవో రజత్ కుమార్ సమావేశం నిర్వహించారు. సమావేశమనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల సలహాలు తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తాం. లోక్ సభ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంతంగా నిర్వహిస్తం. అవసరమైన పోలింగ్ సిబ్బందిని త్వరలోనే నియమించుకుంటం. పోలింగ్ స్టేషన్ల దగ్గర నీళ్లు, నీడ కల్పిస్తం. ఎమర్జెన్సీ కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తం. ఓటర్ లిస్ట్ పై అభ్యంతరాలు ఈ నెల 25వ తేదీ వరకు స్వీకరిస్తమన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర చునావ్ పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు రజత్ కుమార్ చెప్పారు.