నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కవితకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బోధన్ డివిజన్ మహిళా రేషన్ డీలర్లు తెలిపారు. ఎంపీ కవిత తరపున ఎన్నికల్లో తాము ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా వై పద్మారెడ్డిని నియమిస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి వసంత ప్రకటించారు. అనంతరం ఎంపీ కవితకు మద్దతు తెలుపుతున్నట్లు సమావేశంలో తీర్మానం చేశారు. రేషన్ డీలర్ల సమస్యలు తీరాలంటే ఎంపీగా కవితను భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉందన్నారు.