ఏసీబీ వలలో మరో చేప పడింది. భూమి కొలిచేందుకు ఆర్మీ ఉద్యోగిని సర్వేయర్ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అతన్ని వల పన్ని పట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే... జనగామ జిల్లాకు చెందిన పాలకూర్తి డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాస్ ఓ ఆర్మీ ఉద్యోగి ని లంచం డిమాండ్ చేశాడు. దీంతో అతడు ఏసీబీ ని ఆశ్రయించాడు. అధికారులు పథకం ప్రకారం.. రూ.10వేలు లంచం తీసుకుంటుండగా శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడం నేరమని ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.