హైదరాబాద్: విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈబిజ్ సంస్థ మోసాలకు పాల్పడుతోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నోయిడా కేంద్రంగా ఈ-లెర్నింగ్, కంప్యూటర్ కోర్సుల పేరుతో మోసాలు చేస్తున్నారని చెప్పారు. రూ.16 వేలతో ప్రారంభమై రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు. ఈబిజ్ సంస్థ సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు వసూళ్లకు పాల్పడిందని సజ్జనార్ వెల్లడించారు. ఈ-బిజ్ నిర్వాహకుడు హితిక్ మల్హాన్ను అరెస్ట్ చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.70 కోట్లు ఫ్రీజ్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు.