న్యూఢిల్లీ : విదేశాంగ శాఖ మంత్రిని అయ్యాక చక్కటి ఇంగ్లీష్ నేర్చుకున్నానని సుష్మా స్వరాజ్.. ఒకరు చేసిన కామెంట్ కు బదులిచ్చారు. పంజాబ్కు చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి మలేషియాలో పని చేసుకుంటున్నారు. అయితే వీరిలో ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. నా స్నేహితుడు మానసికంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడిని ఇండియాకు పంపాలని అనుకుంటున్నా. కానీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడం లేదు. మేము సహాయం చేయలేం. మొదట ఇక్కడే ఆస్పత్రిలో చికిత్స ఇప్పించండి అని అంటున్నారని.. తనకు వచ్చి రాని ఇంగ్లీష్ భాషలో గేవీ అనే వ్యక్తి తన ట్విట్టర్ ద్వారా సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు స్పందించిన సుష్మా.. మీకు సహాయం చేయమని మలేషియాలో ఉన్న భారత హైకమిషనర్ ను అడిగానని ఆమె మళ్లీ రీట్వీట్ చేశారు. అయితే గేవీ చేసిన ట్వీట్పై సౌరభ్ దాస్ అనే వ్యక్తి స్పందిస్తూ.. అర్థమయ్యేలా పంజాబీలో కానీ లేదా హిందీలో ట్వీట్ చేయ్ అని కామెంట్లో రాశాడు. ఈ కామెంట్పై సుష్మా స్వరాజ్ స్పందిస్తూ.. ఇక్కడేం సమస్య లేదు. విదేశాంగ శాఖ మంత్రిని అయ్యాక ఇంగ్లీష్ నేర్చుకున్నానని, గ్రామర్ సమస్య కూడా లేదని సుష్మా స్పష్టం చేశారు.