హైదరాబాద్: నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఈ నెల 16వ తేదీన జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే ఈ సభా ఏర్పాట్లను నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నేడు పరిశీలించారు. నల్లగొండ బైపాస్ రోడ్డులో నిర్వహించే సభా ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిషోర్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్, ఎఫ్డీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పరిశీలించారు.