న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 17వ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ప్రియాంక దూరంగా ఉంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఎన్నికల్లో కేవలం ఆమె ప్రచారంపైనే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రియాంక కీలకంగా పని చేయనున్నారు. సోనియా, రాహుల్ గెలుపు కోసం దశాబ్ద కాలం నుంచి ప్రియాంక కృషి చేస్తున్న విషయం విదితమే. అమేథి నుంచి సోనియా, రాయ్బరేలీ నుంచి రాహుల్ బరిలో ఉన్నారు.