ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానాలో కలసి పోటీ చేద్దాం: కేజ్రీవాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 05:01 PM

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఏకమవుతున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ హర్యాణలో కలసి పోటీ చేద్దాం అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. హర్యాణలో జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఏఏపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి కూటమిగా ఏర్పడటం ద్వారా 10 ఎంపీ స్థానాల్లో బీజేపీని ఓడించవచ్చని అభిప్రాయపడ్డారు. 10 ఎంపీ స్థానాల్లో బీజేపీని ఓడిస్తే దాని ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుందని వివరించారు. అయితే ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ మద్దతు లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com