చేతిలో నుంచి జారిన రూ.2000 నోటు మెట్రో ట్రాక్పై పడిందని రైలు వస్తున్నా సరే అమాంతం ట్రాక్పైకి దూకేసిందో మహిళ. ఈ సంఘటన దిల్లీలోని ద్వారకా మోర్ మెట్రో స్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. ఆమె మెట్రో రైలు ఎక్కడానికి వచ్చింది. తన దగ్గరున్న నోటు పొరపాటుగా చేజారి ట్రాక్పై పడింది. ఒకపక్క రైలు వస్తుండటం చూసినా సరే ఆమె ట్రాక్పైకి దూకేసింది. ఆమె బయటపడేలోపే రైలు వచ్చేసింది. ప్లాట్ఫాం వద్ద ట్రాక్ పక్కన ఉన్న కొంచెం ఖాళీలో రైలు వెళ్లేంత వరకూ వేచిచూసింది. చిన్న గాయాలతో ఆమె బయటపడింది. అనంతరం మెట్రో రైలు అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సీఐఎస్ఎఫ్ సేవలకు భంగం వాటిల్లినందుకు వారికి ఆమె రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపింది.