మాజీ మంత్రి పీ. సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో ఇవాళ సాయంత్రం ఆయన భేటీ అయ్యారు. సబితా రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆమె అదే పార్టీలో కొనసాగకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మారినందును ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఆమె ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ముందు పెట్టగా, అంగీకరించినట్లు సమాచారం. కార్తీక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై చర్చ జరిగినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశామని, రంగారెడ్డి జిల్లా ప్రజల డిమాండ్లను ఆయన ముందు పెట్టామని కార్తీక్ రెడ్డి మీడియాకు తెలిపారు. చేవేళ్ల లో జరిగే బహిరంగ సభలో నేను, మా అమ్మ సబితా రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నామని తెలిపారు.