రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం నాలుగు స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. మా అభ్యర్థులు పోటీలో లేని చోట కాంగ్రెస్కు మద్దతు తెలుపుతామన్నారు. మేం పోటీ చేసే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతిస్తే స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ తో గాని లేదా ఏ పార్టీతో కుడా మాకు పొత్తు ఉండదని కోదండరాం స్పష్టం చేశారు. వచ్చే నెల 11 న రెండు తెలుగు రాష్టాల్లో ఎన్నికలు జరగనున్న విషయం విథితమే.