టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు గండికొట్టే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసులు రెడ్డిని బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. ఖమ్మంలో ఉన్న బలమైన అభ్యర్థుల్లో మొదటగా పొంగులేటి శ్రీనివాసులు రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటున్నది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వపక్ష పార్టీ అభ్యర్థులను ఓటమి పాలు చేయడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాసులు రెడ్డి మూలంగానే టీఆర్ఎస్ అభ్యర్థులు పలు చోట్ల ఓటమి పాలైనట్లు సీఎం కేసీఆర్ గ్రహించారు. 2014లో వైఎస్సార్సీపీ నుండి పోటీ చేసిన పొంగులేటి నామా నాగేశ్వరరావుపై గెలిచారు. తరువాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఇవ్వనని పార్టీ నేతలతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో పొంగులేటి అభ్యర్థిత్వంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దించాలని కొందరు నేతలు సైతం యోచిస్తున్నారు. ఖమ్మం స్థానం నుండి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎంపీలకు సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేస్తున్నది.