యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదోరోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా ఈ రోజు స్వామీ కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుట్ట పైన అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా గుట్ట కింద ప్రభుత్వ పాఠశాల మైదానంలో కల్యాణం రాత్రి 10 గంటలకు కళ్యాణం నిర్వహిస్తారు. ఉదయం బాలాలయంలో జరిగే పూజల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొని ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలను , తలంబ్రాలు సమర్పిస్తారు.