ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Nukarapu Surya Prakasa Rao | ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్దుల ఖర్చుపై సూర్య అధినేత అభిప్రాయం

mukha mukhi |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2019, 05:24 PM
Nukarapu Surya Prakasa Rao - నూకారపు సూర్యప్రకాష్ రావు

ప్రశ్న : ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ. 50 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేశారంటూ టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచన వ్యాఖ్యలు  చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఒకరు ఢీల్లి  హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై కోర్టులో వాదను జరుగుతున్నాయి. ఈ వ్యాఖ్యల పై మీ అభిప్రాయం?

బి. మురళీ, వరంగల్‌

జవాబు : భారత ఎన్నిక సంఘం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల  వ్యయంపై పరిమితి విధించింది. ఆ పరిమితి పరిధిలో అభ్యర్థి వ్యయం చేయాల్సి ఉంటుంది. ఎన్నికు ముగిసిన తర్వాత తన వ్యయా లెక్కల ను ఎన్నిక సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, వాస్తవ విషయానికి వస్తే, ఎన్నిక సంఘం విధించిన వ్యయ పరిమితి, అభ్యర్థి చేసే వ్యయానికి ఎక్కడా పొంతన ఉండటం లేదన్నది వాస్తవం . పెరుగుతున్న ద్రవ్య్బోణం, వివిధ మీడియాల్లో చేయాల్సిన ఖర్చు, అనుచరుల  ఖర్చు, ఇలా చెప్పుకుంటూ పోతే, వ్యయం చాంతాడంత అవుతుంది. ఇటీవలి  కాలం లో అభ్యర్థులు  ప్రజలను ధనం, మద్యంతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం అధికమైంది. దీంతో ఎలక్షన్లు లో  వ్యయం కోట్లు దాటిపోతోంది.   ఎన్నిక ల సందర్భంగా ప్రస్తుత ఎంపీ రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు ప్రజలు  డబ్బు తీసుకోకపోతే, ఆ ధనం అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నాడు. ఇది నిజమే. మరి ప్రజల కు ఓట్లు కోసం డబ్బు ఇవ్వడం అలవాటు చేసింది ఎవరు?  రాజకీయ నాయకులే అని ప్రజులు  అంటున్నారు. వారు తీసుకుంటున్నారు కాబట్టి మేం ఇస్తున్నామని నేతలు  అంటున్నారు. మరి తప్పు ఎవరిది? స్పష్టంగా చెప్పాంటే ఇద్దరిదీ. ముందుగా ప్రజల్లో మార్పు రావాలి. అభ్యర్థు ఇచ్చే ఆ అయిదు వందలు  ఒక రోజులో ఖర్చయి పోతుంది. కాని అధికారం చేతికి  వచ్చిన తర్వాత, ఆ ప్రజా ప్రతినిధి అయిదేళ్ల పాటు ప్రజల  మొహం చూడడు. వారి సమస్య కంటే, తను ఖర్చు పెట్టిన వ్యయాన్ని ఎలా రాబట్టుకోవాలనే ధ్యాసలో ఉంటాడు. కనుక ప్రజలు  ముందుగా ఎన్నికల్లో ధనం, మందు చూసి ఓటు వేయకుండా, మంచి అభ్యర్థిని చూసి ఎన్నుకుంటే అభ్యర్థి వ్యయం తగ్గుతుంది. ప్రజాధనం స్వాహా కాకుండా ఉంటుంది. ఇది అంతిమంగా దేశాభివృద్ధికి దోహదపడుతుంది. 









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com