ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Nukarapu Surya Prakasa Rao | గ్రామసచివాలయాల్లో సేవల గురించి సూర్య అధినేత అభిప్రాయం

mukha mukhi |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2019, 12:12 PM

Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు


ప్రశ్న: అక్టోబరు 2 నుంచి గ్రామసచివాలయాల్లో సేవలు ప్రారంభంకానున్నాయి కానీ ఇందులో పని చేయాల్సిన వారంతా వైసీపీ కి చెందిన కార్యకర్తలని నియమిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి . ఇప్పటికే  వాలెంటీర్ ల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలలోకి వైసీపీ కార్యకర్తలు 4 లక్షల మందిని ప్రభుత్వం చొప్పించింది. కేవలం ఏడాది పరిమితి తో వీళ్లంతా ఏకంగా 36 విధులు నిర్వహిస్తారని, పారదర్శక పాలన అంటూ ఈ వ్యవస్థలు తీసుకొచ్చింది. ఇది సాధ్యమంటారా?


- జి రామకృష్ణ, వరంగల్ 


జవాబు: పారదర్శక పాలన మాటున పార్టీ కార్యకర్తలను ప్రభుత్వ కార్యాలయాల లోకి జొప్పించారనను కానీ గత జన్మ భూమి కమిటీలకు వీటికి పెద్ద తేడా లేదని చెప్పొచ్చు. ఐతే గౌరవ పారితోషకం కేవలం 5 వేలు సదరు వాలంటీర్లకు చాలదు. పైగా పని వత్తిడి కూడా ఎక్కువే,  ఈ క్రమంలో సవ్యంగా వ్యవస్థ నడుస్తుందని అనుకోవటం భ్రమే, ఇప్పటికే వాలంటీర్లు పెన్షన్లు, ఇతరాలు అదనపు సొమ్ము డిమాండ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో  వినిపిస్తోంది, ఇంకా అక్టోబరు 2 నుంచి ప్రారంభ కానున్న  గ్రామసచివాలయాల్లో సేవలు  అందించేందుకు  11 మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు మినహాయిస్తే  సర్వే అండ్‌ అసిస్టెంట్‌, డిజిటల్‌ సహాయకుడు, విద్యుత్‌ సహాయకుడు ఇలాంటి పోస్ట్లు స్టానికులకే ఇస్తామని చెపుతున్న తెరచాటు రాజకీయాలు ఉండనే ఉంటాయి. కొన్నాళ్ళు ఆగితే కానీ ఈ వ్యవస్థ లోటు పాట్లు మన ప్రభుత్వ పెద్దలకి అర్ధం కావు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com