నల్గొండ: నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలోని సాయిప్రతాప్నగర్కు చెందిన లింగాల శ్రీను(30) అనే వ్యక్తిగా పీకల్దాకా మద్యం తాగి మత్తులో తన గొంతు తానే కోసేసుకున్నాడు. శ్రీను తల్లి లింగాల లక్ష్మమ్మ హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా శ్రీను జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసగా మారి మద్యం డబ్బుల కోసం తరచూ తల్లిని వేధించేవాడు. ఈరోజు ఆమె నిరాకరించడంతో శ్రీను హోటల్ సమీపంలోని రోడ్డుపై మద్యం సీసాను పగులగొట్టి గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్థస్రావం కాగా స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని 108లో ఏరియా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు.