Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న: ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జీ సంఖ్యలను పెంచింది? ఈ జడ్జీ సంఖ్యను ఇంకా పెంచాలని న్యాయనిపుణు వాదిస్తున్నారు. జడ్జీ సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా?
ఇ. కుమారి, కడప
జవాబు : దేశ జనాభా ప్రస్తుతం 134 కోట్లు. అత్యున్నత న్యాయస్థానం ఒక్కటే ఉంది. దేశంలోని పలు కోర్టుల్లో కోట్లల్లో కేసు నడుస్తున్నాయి. హైకోర్టుల్లో తీర్పు వచ్చిన సుప్రీంకోర్టుకు అప్పీలు కోసం వస్తున్నారు. కనుక సుప్రీంకోర్టులో న్యాయమూర్తు లు అధిక గంటు పనిచేయాల్సి వస్తోంది. అందుకని కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తుల సంఖ్యను పెంచింది. అత్యున్నత న్యాయస్తానంపై భారం తగ్గించేందుకు సుప్రీంకోర్టు బెంచ్ను దక్షిణాదిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా చెబుతోంది. మరి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.