ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా పార్థసారథి నియామకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 08, 2020, 07:58 PM

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన్ను ఎస్ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఈసీగా ఆయన పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా, గవర్నర్‌ తమిళిసై ఇందుకు ఆమోదం తెలిపారు. అయితే, తాజా పదవిలో పార్థసారథి ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. పార్థసారథి గతంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. పార్థసారథి 1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. నాగిరెడ్డి గత ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఎస్ఈసీ పదవిలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులను కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆయన్ను ఎంచుకుంది. ప్రభుత్వంలో ఈయన ముఖ్య కార్యదర్శి స్థాయిలో పనిచేసి రిటైరయ్యారు. అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చేసిన పార్థసారధి.. ఆదిలాబాద్‌ డీఆర్‌డీఏ పీడీగా కెరీర్‌ను ప్రారంభించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com