ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సదాశివపేట పట్టణంలో ఉచిత అంబులెన్స్ సేవలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 12:39 PM

చేతిలో 3 నెలల పసికందు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పసికందు చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్ కు 3500 కావాలి. అది చెల్లించలేని దయనీయ పరిస్థితి కారణంగా ఆ చంటి బిడ్డను కోల్పోయాడు ఓ తండ్రి. తన లాంటి కష్టం ఎవరికి రావద్దని రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కో రూపాయి కూడ బెట్టి... పిల్లల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించాడు ఓ మానవతవాది.


మీరు చూస్తున్న ఇతని పేరు సయ్యద్ అంజాద్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఫ్రీగా ఆయూర్వేదిక్ చికిత్స చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం తన 3 నెలల కుమారుడు అనారోగ్యంతో కన్నుమూసాడు. చికిత్స కోసం అంబులన్స్ లో హైదరాబాద్ తీసుకెళ్లేందుకు చేతిలో 3500 రూపాయలు లేక తన కొడుకును కోల్పోయాడు అంజాద్. తనకొచ్చిన కష్టం ఏ తండ్రికి రాకూడదని ఉచిత అంబులెన్స్ సేవలు చేపట్టాలని అంజాద్ ఆ రోజే నిర్ణయించుకున్నారు.


 


లాక్ డౌన్ సమయంలో సైతం అంజద్ స్వయంగా వంట చేసి రోజూ వందాలది మందికి ఉచిత భోజనంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా కాలంలో చేసిన సేవలకు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పనులకు తోడు వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్యం ను సైతం ఉచితంగా అందిస్తూ అందరి ఆదరణ పొందుతున్నారు. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నానని ఆలోచించకుండా తనకు వచ్చిన కష్టం ఇంకెవరికి రావద్దని, తనలా ఎవరూ బాధపడకూడదని అంజద్ చేస్తున్న సేవలు నిజంగా అభినందనీయం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com