ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టులో టీఎస్‌ లాసెట్ పరీక్షలు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 01:12 PM

ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసి. మార్చి 26 నుంచి మే 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆలస్య రుసుంతో జులై 20వ తేదీ వరకు దరఖాస్తులను చేసుకోవచ్చని ప్రకటించింది. జులై 20 నుంచి పరీక్ష హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది కూడా లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకుంది. కన్వీనర్‌గా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జీబీ రెడ్డి కొనసాగుతారని వెల్లడించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com