ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతబస్తీలో భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 01:27 PM

హైదరాబాద్‌లోని పాతబస్తీలో గురువారం భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. అక్రమంగా పేలుడు పదార్ధాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెయ్యి కేజీల డిటోనేటర్ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. నాలుగు రోజుల క్రితం కరీంనగర్‎లో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో అసలు గుట్టు బయటపెట్టాడు. దీంతో నిందితుడిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి.. అతని విచారించగా పాతబస్తీలోని డిటోనేటర్ కేంద్రాలు బయటపడ్డాయి. దీంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాతబస్తీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫలక్‌నుమాలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రాన్ని గుర్తించారు. కరీంనగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. డిటోనేటర్ పేలుడు పదార్థాలను తయారు చేసి.. మావోయిస్టు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com