హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈనెల 12 వరకు టెస్టుల వివరాలను నివేదికలో తెలిపింది. జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సీరం సర్వేలు జరిగాయని పేర్కొంది. వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. శుక్రవారం నుంచి కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై విస్తృత ప్రచారం చేయాలంటూ.. తదుపరి విచారణ మార్చి 18కి హైకోర్టు వాయిదా వేసింది.