మంత్రి కేటీఆర్ కి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో సుమారు 4,90,000 ఉద్యోగాలున్నాయి. అవన్నీ ఇచ్చింది ఎవరు..? కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించారు. క్యాడర్ స్ట్రేంథ్ పెంచుకుంటూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని అని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిందని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిందని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే.. లక్ష 91 వేల ఉద్యోగాల ఖాళీ ఎక్కడి నుండి వచ్చింది అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏమైందని అన్నారు. ప్రయోజనాలు, పరిస్థితిని బట్టి పార్టీలో చేరికలు ఉంటాయి. ఏ పోరాటం చేయకున్నా.. గొప్పగా చూపించే వాళ్ళున్నారు. కాంగ్రెస్ ఏం చేసినా చూపించనోళ్లు ఉన్నారు. ఎంత వరకు కొట్లాడగలమో అంత కొట్లాడుతున్నాం. మేము పరిపాలనకు రాకపోయినా.. ప్రజలకు మేలు జరగాలి. మా వల్లనే మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రజలు మాకు అధికారం ఇస్తారని జానారెడ్డి అన్నారు.