కాంగ్రెస్ పార్టీ నేతలు ఐక్యతగా పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పిలుపు ఇచ్చారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాయకుల మధ్య ఎవరికైనా బేదాభిప్రాయాలు ఉంటే.. అలాగే పార్టీ పద్ధతుల్లో ఉన్నా పార్టీ ఫోరమ్స్లో చర్చించి.. పరిష్కరించుకుని సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ మధ్య కాలంలో నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు తనకు తెలిసిందన్నారు. గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు సరికాదని, నాయకులను టార్గెట్ చేసి పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. అలాగే పార్టీని బలహీనపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని, పీసీసీ స్పందించకపోతే.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని జానారెడ్డి స్పష్టం చేశారు.