ఓ యువతిని ఆన్లైన్లో వేధింపులకు గురిచేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ప్రాంతానికి చెందిన చెంబేటి చరణ్(20) ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్నాడు. తనతోపాటు స్కూల్లో చదువుకున్న యువతిని ప్రేమించగా.. ఆమె తిరస్కరించింది. ఆ యువతికి తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి చేశారు. యువతిపై కక్ష పెంచుకున్న చరణ్ ఆమెకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్లు, ఫొటోలు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కొంతకాలంపాటు భరించిన యువతి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ సైబర్క్రైం సిబ్బంది సాంకేతిక ఆధారాలతో నిందితుడు చరణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు