హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో కేరళ కు చెందిన ఉదయ్ తుల్లా అనే ప్రయాణీకుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలో మైనర్ బాలిక హత్య యత్నం కేసులో ఉదయ్ ప్రధాన నిందితుడు. దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన నిందితుడిని... లుక్ ఔట్ నోటీస్ ద్వారా ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. పట్డుబడ్డ నిందితుడిని కేరళ పోలీసులకు అధికారులు అప్పగించనున్నారు. పోలీసుల గళ్లుగప్పి విదేశాలకు పారి పోయేందుకు ప్రయత్నించిన కేటుగాడి ఆట కట్టించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. నిందితునిపై కేరళ రాష్ట్రంలోని మల్లాపూరం పోలీస్స్టేషన్లో 307, 323, 324, 326 సెక్షన్ల కింద కేసు నమోదు అయినట్లు కేరళ పోలీసులు తెలిపారు.