ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకు మేనేజర్‌కు మూడేళ్ల జైలు శిక్ష..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 04:21 PM

ఏటీఎంలో పెట్టాల్సిన సొమ్మును కాజేసి సొంత బ్యాంకుకే నమ్మక ద్రోహం చేసిన మేనేజరుకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 జరిమానా విధిస్తూ సైబరాబాద్‌ ఆరో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కర్నాటి కవిత తీర్పునిచ్చారు. బాగ్‌అంబర్‌పేట వాసి భాస్కర్‌రావు 2007లో దిల్‌సుఖ్‌నగర్‌లోని కెనరా బ్యాంకులో చీఫ్‌ మేనేజరుగా పనిచేశారు. బ్యాంకు ఏటీఎంలో నిత్యం భాస్కర్‌రావు మరో ఇద్దరు సిబ్బందితో కలసి డబ్బులు పెట్టేవారు. అదే ఏడాది ఆడిట్‌ నివేదికలో ఏటీఎంలో పెట్టాల్సిన సొమ్ములో రూ. 10, 34, 500 గల్లంతైనట్లు గుర్తించారు.
బ్యాంకు కేంద్రియ సాంకేతిక నిర్వాహకులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా భాస్కర్‌రావు మరో ఇద్దరు అధికారులు శేషసాయి, నాగప్ప కలిసి సొమ్మును దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. సరూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. శేషసాయి, నాగప్ప క్వాష్‌ పిటిషన్లు వేసి అభియోగాలను రద్దు చేయించుకున్నారు. 14 ఏళ్ల విచారణ అనంతరం భాస్కర్‌రావుకు శిక్ష విధించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com