విలాస జీవితానికి అలవాటుపడుతున్న కొందరు మహిళలు తమకు వచ్చే ఆదాయం సరిపోక పక్కదారి పడుతున్నారు. అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడుతున్నారు. మల్కాజ్గిరిలో ఉంటున్న ఓ మహిళ ఇలాంటి చర్యలకు పాల్పడి పోలీసులకు చిక్కింది. మహారాష్ట్ర లాతూర్కు చెందిన పూజా కాంబ్లే అనే మహిళ మల్కాజిగిరిలో టిఫిన్ సెంటర్లో పని చేస్తుంది. విలాస జీవితానికి అలవాటు పడ్డ నిందితురాలు కొంత కాలంగా ఇతర రాష్ట్రాల యువతులను తీసుకువచ్చి తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. దీనిపై చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గత రాత్రి ఆమె ఇంటిపై దాడి చేసి ఆమె వ్యభిచార దందా గుట్టును రట్టు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో మహిళను హోంకు తరలించారు.