సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన చేసారు మంత్రి హరీశ్రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నామని తెలిపారు. సత్తుపల్లిలో 100 శాతం కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. జిల్లాలోని సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీశ్రావు శనివారం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రానికి డయాలసిస్ సెంటర్, ఐసీయూ వార్డులను తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు.