తెలంగాణ గవర్నర్ తమిళిసైతో బీఆర్ఎస్ మంత్రులు ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు సోమవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. రాజ్భవన్కు చేరుకుని గవర్నర్తో మాట్లాడారు. గవర్నర్తో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది.