ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి భాను కుమార్ ముదిరాజ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీని వారి ఇంట్లో మర్యాదపూర్వకంగా కలసి వారితో క్యాలెండర్ ఆవిష్కరణ జరిపించారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి భాను కుమార్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మత్స్య సహకార సభ్యత్వాన్ని అందరూ వినియోగించుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహసభ హైదరాబాద్ ప్రెసిడెంట్ మహేందర్ యాదవ గారు మరియు భాను ముదిరాజ్ గారి బృందం పాల్గొన్నారు.