సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా గజ్వేల్ పట్టణానికి చెందిన జాకీర్ షరీఫ్ ను సోమవారం డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి నియమించారు. ఈ మేరకు జాకీర్ కు నియామక పత్రాన్ని అందజేశారు. తనపై విశ్వాసంతో జిల్లా మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించినందుకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.