సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 86లక్షల హవాలా నగదును మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందమూరి మనోజ్ అనే వ్యక్తి నుంచి సైదాబాద్ లక్ష్మీ నగర్ కాలనీలోని నరేష్ అనే వ్యక్తి నుంచి నగదు తీసుకొని ఆక్టివా ద్విచక్ర వాహనం పై సికింద్రాబాద్ కు తరలిస్తుండగా దోబీఘాట్ చౌరస్తాలో పట్టుకున్నారు. బంగారం , రియల్ వ్యాపారం నిర్వహించే తన యజమాని ఆదేశాల మేరకు డబ్బులు తీసుకొని వెళ్తున్నట్లు మనోజ్ చెపినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఐటిశాఖ అధికారులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.