కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాలిపోచమ్మ బస్తీలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై తప్పక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బస్తీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.