ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 01:00 PM
దమ్మపేట మండలంలో మద్యానికి బానిసైన వ్యక్తి ద్విచక్ర వాహనం అడిగినందుకు ఇవ్వలేదనే కోపంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట మండలం సుధాపల్లి గ్రామానికి చెందిన సోడేం నాగబాబు మద్యానికి తీవ్రంగా బానిసచయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన సోడెం నాగబాబు తండ్రి సోడెం వెంకటేశ్వరరావును బయటకు వెళ్లడానికి తన ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని అడిగాడు. దీంతో తండ్రి బండి ఇవ్వననడంతో వెంటనే పురుగుల మందు తాగాడు, గమనించిన కుటుంబసభ్యుల హుటాహుటిన నాగబాబును దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com