కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం శంభీపూర్ లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు మంగళవారం శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అదే విధంగా వివిధ శుభకార్యాలకు హాజరు కావాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.