ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెల్లూరు లో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 02:11 PM

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని వెల్టూరు గ్రామంలో మంగళవారం ప్రభుత్వ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సామాజికవేత్త అయినేని సంతోష్ కుమార్ అధ్వర్యంలో ఉదయం పూట అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆర్. రంగారెడ్డి , పి. అర్జున్ రావు, ప్రధానోపాధ్యాయులు రవిశంకర్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సామాజికవేత్త, కార్యక్రమం నిర్వాహకులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ నిత్యం పాఠశాలకు రావాలని , ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులు ఉదయం పూట ప్రత్యేక తరగతులకు రావడంతో వారు ఉదయం అల్పాహారం తినడం లేదని, విద్యార్ధుల ఆరోగ్యం పరిరక్షించేందుకు, విద్యార్థులు చదువుపై దృష్టి నిలిపేందుకు ఈ కార్యక్రమాన్ని చెప్పట్టడం జరిగిందని అన్నారు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు అల్పాహారం వండి పెడుతున్న వసంతకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థుల నుంచి వచ్చే ప్రతిస్పందనను బట్టి మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జి. లింగయ్య, సిహెచ్. లింగయ్య, పి. జంగారావు, వసంత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com