మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం వర్నే గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం పేరిట ఇసుకను త్రవ్వి డబల్ బెడ్ రూమ్ నిర్మాణానికి తరలిస్తున్నారని బసిరెడ్డి సంతోష్ రెడ్డి ఆరోపించారు. గ్రామస్తులు ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న పోలీస్ కాపలతో ఇసుక టిప్పర్లను తరలిస్తున్నారన్నారు. ట్రిప్పర్లను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులును, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. గ్రామస్తుల, రైతుల తరఫున బిఎస్పీ పార్టీ అండగా ఉంటుందని సంతోష్ రెడ్డి తెలియజేశారు.