గట్టు మండల పరిధిలోని మాచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం నాడు ఆకస్మాత్తుగా మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ విజయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు నర్సింలు తోపాటు మధ్యాహ్నం భోజనం వర్కర్లతో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని పెట్టాలని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా విద్యార్థులకు కడపు నిండా భోజనం పెట్టాలని తెలియజేశారు. ప్రతిరోజు మెనూ ప్రకారం వడ్డించాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులను భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు తుమ్మలపల్లి సర్పంచ్ చెన్నారాయుడు, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.