రాజంపేట మండల తహసిల్దారిగా బాధ్యతలు చేపట్టిన టి. శాంతను సోమవారం రాజంపేట కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. మండలంలో రెవెన్యూ సమస్యలు పారదర్శకంగా పరిష్కరించి మండల అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే. బాలకిషన్, సొసైటీ డైరెక్టర్లు వజహత్ అలీ , సుధాకర్ రెడ్డి , ఇమ్రాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.