బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమాఖ్య-(బి ఎల్ టి యు)అనుబంధ గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటి కన్వీనర్ గా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన దండుగుల లింగమయ్య ను రాష్ట్ర కన్వీనర్ గా నియమిస్తున్నట్లు బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగాద సిద్దిరాములు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ లో దాదాపు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికు సమస్యలపై డి. లింగమయ్య కృషి చేస్తారని బిఎల్ టియ రాష్ట్ర కమిటి ఆశిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక నిధి 500 కోట్లతో ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారని సిద్దిరాములు గుర్తుచేశారు. గల్ఫ్ కార్మికుల్లో 99% బహుజన జాతులకు చెందిన బిసి, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ శ్రమజీవులేనని తెలిపారు. రాబోయే రోజుల్లో బిఎల్టియు ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.