కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు వరమని ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్ లోని మహమ్మదీయ ఫంక్షన్ హాల్లో నూట మూడు మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంగళవారం పంపిణీ చేసిన ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గౌసుద్దీన్, రవి చారి, బి ఆర్ ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా, మండల్ ఆఫీస్ అధికారులు స్వప్న, ఆదిల్, బి ఆర్ ఎస్ స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, వల్లాల శ్యామ్ యాదవ్, రావులపాటి మోజస్, రాకేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి మరియు కార్యదర్శిలు బి ఆర్ ఎస్ సీనియర్ లీడర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.