కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం నల్లగుట్టలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ శివపూజ మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా సహకారం అందిస్తానని అన్నారు. నల్లగుట్ట భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం వద్ద త్వరలోనే రోడ్డు అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దూదిమెట్ల సోమేష్ యాదవ్, ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.